భర్త కళ్లెదుటే భార్య మృతి

AP: భర్తతో కలిసి బైక్పై వెళ్తున్న మహిళ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందడంతో పోలవరంలో విషాదం నెలకొంది. ఏలూరు జిల్లా పోలవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మి (38) బైక్పై నుంచి కిందపడిపోయారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. భర్త కళ్లెదుటే భార్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


