భార్య మృతి.. ఆ వెంటనే భర్త కూడా

TG: హైదరాబాద్ లాలాగూడలో విషాద ఘటన జరిగింది. ఒక సంవత్స క్రితం పెళ్లైన చరణప్ప, లక్ష్మి దంపతులు గంటల వ్యవధిలో మృతి చెందారు. ఇంట్లో లక్ష్మి ఉరివేసుకుని మృతి చెందగా, ఆమెను చూసిన ఆమే భర్త చరణప్ప ఇంటి నుంచి వెళ్లాడు. తర్వాత రైల్వే బ్రిడ్జి వద్ద రైలు కింద పడి చనిపోయాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. కుటుంబ సమస్యలపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.



