← Back to news

చీరాలలో ఆర్టీఐ కార్యకర్త కిడ్నాప్

By Kishore swamy· 20 Aug 2026· Chirala (Ct), Chirala, Bapatla
చీరాలలో ఆర్టీఐ కార్యకర్త కిడ్నాప్

AP: బాపట్ల జిల్లా చీరాలలో మైనింగ్ అక్రమాలపై జాయింట్ ఇన్స్‌ఫెక్షన్‌కు హాజరైన ఆర్టీఐ కార్యకర్త నాయుడు నాగార్జునరెడ్డిని దుండగులు కిడ్నాప్ చేశారు. ఆయనను తీవ్రంగా కొట్టి చీరాల ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలేసి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మైనింగ్ మాఫియా ఆగడాలు శృతిమించాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

More in Local