← Back to news

కెమెరాలు ఆఫ్ చేసి.. పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ

By dk· 16 Aug 2026· పెద్దపల్లి జిల్లా
కెమెరాలు ఆఫ్ చేసి.. పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ

TG: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ముందుగా ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆఫ్ చేసిన దుండగులు.. అనంతరం లోపలికి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించినట్లు తెలుస్తోంది. ఉదయం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రామగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆలయాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

More in Local