యువత ఉజ్వల భవిష్యత్తే లక్ష్యం: మంత్రి వివేక్

TG: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్నచింతకుంట మండలంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) ఏర్పాటుకు అడుగు పడింది. లాల్కోట–నెల్లికొండి గ్రామాల మధ్య ఎర్రగట్టు వద్ద రూ.44 కోట్లతో నిర్మించనున్న ATCకి మంత్రి వివేక్ వెంకటస్వామి, MLA జి. మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంత యువత నగరాలకు వెళ్లకుండానే ఆధునిక సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ పొందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.



