ఘనంగా కామ్రేడ్ సీతక్కకు నివాళులు

AP: శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలాసలో కామ్రేడ్ బాలకృష్ణ అధ్యక్షతన కామ్రేడ్ సీతక్క సంతాప సభ నిర్వహించారు. గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమంలో సీతక్క పోషించిన పాత్రను స్మరించుకున్నారు. ప్రజా ఉద్యమాల పట్ల ఆమె చూపిన అంకితభావం, ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సీతక్కకు ఘన నివాళులర్పించారు.





