← Back to news

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను కాపాడుకోవాలి

By .· 17 Aug 2026
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను కాపాడుకోవాలి

TG: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను కాపాడుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని నిరసిస్తూ హనుమకొండ జిల్లా పరకాల బస్టాండ్‌ సెంటర్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి నేతృత్వంలో కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కౌన్సిలర్‌ దుబాసి వెంకటస్వామి, బీఆర్‌ఎస్‌ పరకాల పట్టణ ఉపాధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ కేసీఆర్‌ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఆ పథకాలను నిలిపేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను కాపాడుకోవాలి

More in Local