← Back to news

జన్నారం మండలంలో ఓటర్ల జాబితాలపై కీలక ప్రకటన

By Jelandharkoti Koti· 21 Aug 2026
జన్నారం మండలంలో ఓటర్ల జాబితాలపై కీలక ప్రకటన

TG: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసి, పరిశీలన అనంతరం జాబితాలను ప్రకటించినట్లు మంచిర్యాల జిల్లా జన్నారం మండల తహశీల్దార్ బక్కయ్య తెలిపారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల నోటీసుబోర్డుల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రదర్శించినట్లు వెల్లడించారు. ఓటర్లు తమ పేర్లు, వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. జాబితాలో పేరు లేని అర్హులైన కొత్త ఓటర్లు ఫారం-6 ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

More in Local