← Back to news

ఏనుగుల సంచారం .. రైతులకు తీవ్ర నష్టం

By DeeK· 16 Jun 2026· Dishadaily
ఏనుగుల సంచారం .. రైతులకు తీవ్ర నష్టం

AP: మన్యం జిల్లా మక్కువ మండలంలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. సిబిల్లి పెద్దవలస, కాముడువలస గ్రామాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ.. రైతులు, స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. జూన్ 13న సాలూరు నుంచి ఒడిశాకు వెళ్లిన ఏనుగులు.. మళ్లీ ఒడిశా నుంచి సాలూరుకు చేరాయి. కాముడువలసలో పామాయిల్ తోటలను, తోటలో ఉంచిన మోటార్లను ఏనుగులు ధ్వంసం చేశాయి. తాము కోలుకోలేని విధంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

More in Local