రాజీవ్ గాంధీ జయంతి..ఘన నివాళులు

TG: యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని, రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ అభివృద్ధి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ అందించిన సేవలను స్మరించుకున్నారు.




