← Back to news

దళితుల భూములపై ఆక్రమణల చర్యలు అవసరం

By ORSU KRISHNA· 17 Aug 2026· Vinukonda
దళితుల భూములపై ఆక్రమణల చర్యలు అవసరం

AP: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం పిచికలపాలెం గ్రామంలో దళితులకు కేటాయించిన భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని దళితులు, ప్రజాసంఘాలు పల్నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్ 246/సి పరిధిలో 73 మంది దళితులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల చొప్పున ఇంటి స్థల పట్టాలు మంజూరైనా, పొజిషన్ చూపించలేదని ఆరోపించారు. ఈ భూమిపై ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని ప్లాట్లను లబ్ధిదారులకు అప్పగించాలని కోరారు.

More in Local