అర్చకులు విదేశాలకు వెళ్లొస్తే ఏమవుతుందో తెలుసా ?

విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు ఇక గర్భాలయంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏపీ హైకోర్టు దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భాలయంలోకి వెళ్లి పూజలు చేయడానికి వీల్లేదని 2010లోనే దేవాదాయ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. శృంగేరి శారదా పీఠం జగద్గురువు శ్రీభారతి తీర్థ మహాస్వామి కూడా దీనినే సమర్థించారు. విదేశీ ప్రయాణాలు చేసివచ్చినా గర్భాలయంలోకి ప్రవేశిస్తున్న పూజారులను అడ్డుకోవాలంటూ దేవాదాయ శాఖ దాఖలు చేసిన పిటిషన్న్ ను న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వరులు విచారించారు. విదేశాలకు వెళ్లొస్తే అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదని స్పష్టం చేశారు.


