← Back to news

నాగదేవత మండపం ప్రారంభం

By Madhu Gadenaveni· 16 Aug 2026· Thangallapalle, Thangallapalli, Rajanna Sircilla
నాగదేవత మండపం ప్రారంభం

TG: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద నాగదేవత మండపాన్ని ఆదివారం ప్రారంభించారు. తంగళ్ళపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజం మాట్లాడుతూ రూ 1,20,000 సొంత ఖర్చులతో వెంగళ శివలక్ష్మి నరసయ్య ఈ మండపం నిర్మించారని పేర్కొన్నారు. వారికి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో మచ్చ శ్రీనివాస్, సుద్దాల కర్ణాకర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

More in Local