← Back to news

నిద్రమత్తులో డ్రైవింగ్.. బోల్తా కొట్టిన సుబాబుల్ లారీ

By Venkat V· 17 Aug 2026· మైలవరం

AP: NTR జిల్లా మైలవరం-ఛత్తీస్‌గఢ్ జాతీయ రహదారిపై మైలవరం బైపాస్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి వరంగల్‌కు సుబాబుల్ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

More in Local