← Back to news

డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే మంచి భవిష్యత్తు: SI

By Anaparthi News· 21 Aug 2026· Pandalapaka, Biccavolu, East Godavari

AP: మాదకద్రవ్యాల అలవాటుతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఎస్సై రవిచంద్రకుమార్ హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘కనెక్ట్ యూత్’ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యంతో పాటు విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. బాలికల భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు.

More in Local