← Back to news

పెద్ది కుటుంబానికి KCR భరోసా

By dk· 8 Aug 2026
పెద్ది కుటుంబానికి KCR భరోసా

TG: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి BRS అధినేత KCR అండగా నిలిచారు. ఆయన ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. వృద్ధాప్యంలో ఉన్న సుదర్శన్‌రెడ్డి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం ఆమె పేరుపై మరో రూ.25 లక్షలను బ్యాంకులో జమ చేయాలని తెలిపారు. మొత్తంగా కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు. పిల్లల చదువు, భవిష్యత్‌తో పాటు కుటుంబ సంక్షేమానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.

More in Politics