ప్రాణాలు పోయినా పరిహారం దక్కదా?

సెప్టిక్ ట్యాంకులు, మురుగు కాలువలు క్లీన్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న Workers Families పరిస్థితి దారుణంగా ఉంది. 2021 జనవరి–2026 జూన్ మధ్య 332 మంది కార్మికులు చనిపోయారు. చట్టప్రకారం వాళ్లకు రావాల్సిన 30 లక్షల రూపాయల పరిహారం కోసం బాధిత కుటుంబాలు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. మ్యాన్యువల్ స్కావెంజింగ్ నిషేధంలో ఉన్నా సేఫ్టీ గేర్ లేకుండా ప్రమాదకర పనుల్లోకి దింపడం, రూల్స్ పేరుతో అధికారులు చేతులెత్తేయడంతో వారి బతుకులు దారుణంగా మారుతున్నాయి. ప్రాణాలు పోతున్నా హక్కుల కోసం పోరాడాల్సి రావడం బాధాకరం!


