పెండింగ్ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ

TG: ప్రజలకు పోలీసులు మెరుగైన సేవలు అందించాలని, పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని మెదక్ ఎస్పీ డీవీ.శ్రీనివాస్ రావు సూచించారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ పోలీస్స్టేషన్ను ఎస్పీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, పెండింగ్ కేసులు, నేర నియంత్రణ చర్యలు, సిబ్బంది విధి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించిన ఎస్పీ.. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.



