గొల్లప్రోలు మున్సిపాలిటీలో పునర్విభజన

AP: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన పూర్తయింది. ఇప్పటివరకు ఉన్న 20 వార్డులను 23 వార్డులుగా పునర్వ్యవస్థీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని వార్డుల సరిహద్దులను నిర్ణయించారు. పునర్విభజనకు సంబంధించిన సరిహద్దులతో కూడిన 23 వార్డుల వివరాలను పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. మున్సిపల్ కమిషనర్ సంపత్తి దివిజ ఆధ్వర్యంలో నోటీస్ బోర్డులో గెజిట్ వివరాలను ప్రదర్శించారు.



