చినతీనార్లలో ఘనంగా సరస్వతి విగ్రహావిష్కరణ

AP: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినతీనార్ల గ్రామంలో అరుణ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి విగ్రహాన్ని ఎంపీడీవో కె చలపతిరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల స్థాయి క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తున్న ట్రస్టు సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్ఎం బి. సింహాచలం, పంచాయతీ సెక్రెటరీ చిన్నమనాయుడు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



