అంతరాయం లేకుండా రైతుబీమా కొనసాగించాలి

TG: రైతు కుటుంబాలకు భరోసాగా నిలిచే రైతు బీమా పథకాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించాలని రైతు రక్షణ సమితి డిమాండ్ చేసింది. హన్మకొండ జిల్లా పరకాలలో జిల్లా వ్యవసాయ అధికారి విజయ్చంద్రను రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కిషన్రావు, ఇతర నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. రైతు బీమా పథకాన్ని కొనసాగించడంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న రైతు బీమా క్లెయిమ్లను వెంటనే పరిష్కరించి బాధిత రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.



