గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్

TG : నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఇవాళ జిల్లా గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతతో ఆయన మాట్లాడి, ఎలా చదువుకుంటున్నారో తెలుసుకున్నారు. గ్రంథాలయంలోని పుస్తకాలు, ఉచిత ఆన్లైన్ సేవలు, దినపత్రికలను రోజూ వాడుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో ఎక్కువ ఉండకుండా, పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని అన్నారు. యువతకు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.



