ఇకపై PhonePe, GPay ఉచితం కాదా?

గూగుల్ పే, ఫోన్ పే వంటి UPI లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసేలా బ్యాంకర్లకు పర్మిషన్ ఇచ్చే 'పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007' సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లు పాస్ కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో ప్రతీ చిన్న పేమెంట్కి UPI వాడుతున్న నేపథ్యంలో, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య యూజర్లపై పెద్ద భారం మోపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.



