← Back to news

బండి సంజయ్‌కు కాంగ్రెస్ నేత ఓపెన్ ఛాలెంజ్

By dk· 8 Aug 2026· కరీంనగర్ జిల్లా
బండి సంజయ్‌కు కాంగ్రెస్ నేత ఓపెన్ ఛాలెంజ్

TG: కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేంద్ర నిధులుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం రూ.210 కోట్లు ఇస్తే రూ.840 కోట్లు తామే ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా లేకుండా ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని పేర్కొన్నారు. నిధులపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, బండి సంజయ్ సిద్ధమా అని సవాల్ చేశారు.

More in Politics