← Back to news

తమ ధాన్యానికి తొందరగా తూకం వేయండి సారూ

By dk yamjala· 26 May 2026
తమ ధాన్యానికి తొందరగా తూకం వేయండి సారూ

TG: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సూరారంలో నెలరోజులు దాటినా ధాన్యాన్ని తూకం వేయడంలేదని, లారీలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. తన హెల్త్ బాగలేక హాస్పిటల్‌కు వెళ్లి వచ్చానని, 45రోజులు దాటినా ఇప్పటికీ ధాన్యం తూకం వేయలేదని రైతు నాగులు తన బాధను తెలిపాడు. కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం లోడ్ చేసి రైస్‌మిల్‌కు పంపి ఐదురోజులు గడుస్తుందని, లారీలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నలుగురు ఐదుగురు రైతులతో కలిసి లారీలను తీసుకొచ్చి ధాన్యాన్ని తరలిస్తున్నామని నిర్వాహకురాలు ఊర్మిళ తెలిపారు. అందుకే వరుసక్రమంలో లారీలను పెట్టలేకపోతున్నామని ఆమె చెప్పారు.

తమ ధాన్యానికి తొందరగా తూకం వేయండి సారూ
తమ ధాన్యానికి తొందరగా తూకం వేయండి సారూ

More in Local