ప్రజాసమస్యలను తక్షణమే పరిష్కరించాలి: సీతక్క

TG: ప్రజాసమస్యలను తక్షణమే పరిష్కరించాలని మంత్రి దనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయిలో బుధవారం నిర్వహించిన 'ప్రజాదర్బార్'కు విశేష స్పందన లభించింది. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మంత్రి సీతక్క స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ దర్బార్లో ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఇతర సమస్యలపై స్థానికులు పెద్దఎత్తున మంత్రికి దరఖాస్తులు అందజేశారు.


