← Back to news

300 మంది విద్యార్థినులకు నోట్‌బుక్స్ పంపిణీ

By Salman Mohammad· 18 Aug 2026· Sircilla, Sircilla, Rajanna Sircilla
300 మంది విద్యార్థినులకు నోట్‌బుక్స్ పంపిణీ

TG: సిరిసిల్ల ప్రభుత్వ బాలికల కళాశాలలో 300 మంది విద్యార్థినులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ జి. వనజా కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి 4వ వార్డ్ కౌన్సిలర్ లైఖ్ సుల్తానా తాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం తొలిసారిగా ఇంటర్మీడియట్ విద్యార్థినులకు ఒక్కొక్కరికి 12 ఉచిత నోట్‌బుక్స్ అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థినులు కష్టపడి చదివి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

More in Local