బాల కార్మికులు లేని సమాజమే లక్ష్యం

TG: బాల కార్మికులు లేని సమాజ నిర్మాణానికి అందరం పాటుపడాలని బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమిదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్రస్వామి దేవాలయానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ బాలల హక్కులను పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. బాలలతో ఎవరైనా పని చేసినట్లయితే టోల్ఫ్రీ నెంబర్ 1098కు సమాచారం అందించాలని వారు తెలిపారు.



