'అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి'

TG: హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సంబంధితశాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం మాజీ ప్రధానమంత్రి దివంగత నేత పాములపర్తి వెంకట నరసింహారావు స్వగ్రామమైన వంగరలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పీవీ స్ఫూర్తి వనంలోని ఫోటోగ్యాలరీ, సైన్స్ మ్యూజియం, సమావేశ మందిరాన్ని సందర్శించిన కలెక్టర్, అసంపూర్తిగా ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని పర్యాటక శాఖ, కుడా అధికారులకు సూచించారు.


