వికలాంగుడికి ఇల్లు నిర్మించి ఇస్తా: యాదగిరి గౌడ్

TG: యాదాద్రిభువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామానికి చెందిన వికలాంగుడు సింగారం రమేష్కు సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి మానవతా దృక్పథంతో స్పందించారు. బీర్ల ఫౌండేషన్ సహకారంతో రమేష్కు ఇల్లు నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయించి, అవసరమైన సహకారం అందించి సొంత ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. రమేష్ కుటుంబానికి భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు యాదగిరి తెలిపారు.



