← Back to news

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం.. ఇద్దరి అరెస్ట్

By Ram krishna· 19 Aug 2026· Venkatapuram
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం.. ఇద్దరి అరెస్ట్

AP: కడప జిల్లా పులివెందుల ప్రజల్ని ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 2019లో ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని వెన్నపూస మల్లికార్జున రెడ్డిని, 2023లో రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని ఇస్లావత్ జనార్దన్ నాయక్‌ని నమ్మించి డబ్బులు వసూలు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు విశాఖపట్నానికి చెందిన నామల జన‌ప్రకాష్ రావు, తిరుపతి జిల్లాకు చెందిన కృష్ణయ్య మహేష్‌లను అరెస్టు చేశారు. రూ.8 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

More in Local