మున్సిపల్ కార్మికుల నిరసన
AP: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసనకు దిగారు.. మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, మున్సిపల్, పౌర సేవల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు .



