మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

TG: నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో పదో తరగతి వరకు కలిసి చదువుకున్న తమ మిత్రుడు బోజారాం అనారోగ్యంతో మృతి చెందడంతో స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుని భార్య విజయలక్ష్మిని పరామర్శించి, పిల్లలు హర్షిత్(11), హర్షిత(8) బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో రూ.51 వేల సహాయాన్ని అందించారు. భవిష్యత్తులోనూ అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు



