విధుల్లోనే ప్రాణాలు కోల్పోయిన లైన్మెన్

TG: పల్నాడు జిల్లా ఈపూరు మండలం బొగ్గరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్న పి. వెంకటేష్ విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. రొంపిచర్ల మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ విధుల్లో భాగంగా బొగ్గరం గ్రామ పరిధిలోని పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎడ్జ్ ఫ్యూజ్ సేకరణ పనులు చేస్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.



