← Back to news

మెరుగైన వైద్య సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం

By K.RAMESH· 18 Aug 2026
మెరుగైన వైద్య సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం

మారుమూల, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. వాంకిడి మండలం ఇందాని గ్రామంలో గ్రాన్యుల్స్ ఇండియా ఫార్మా కంపెనీ రూ.25 లక్షల సీఎస్‌ఆర్‌ (CSR) నిధులతో నిర్మించనున్న ఆరోగ్య ఉపకేంద్రానికి ఆమె భూమిపూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య మౌలిక వసతులను బలోపేతం చేయడమే ధ్యేయంగా ఈ నిర్మాణం చేపడుతున్నామని, ఇది అందుబాటులోకి వస్తే ఇందాని గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రాథమిక వైద్యం సులభంగా అందుతుందన్నారు.

More in Local