← Back to news

పెద్దపులి సంచారంతో తగ్గిన పర్యాటకులు

By DK· 5 Jun 2026· Eenadu· పోలవరం జిల్లా
పెద్దపులి సంచారంతో తగ్గిన పర్యాటకులు

AP: పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పరగసానిపాడు, కూడిపల్లి, బోడిగూడెంలో పులి సంచారం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పులి మెడకు అమర్చిన రేడియో కాలర్, డ్రోన్ కెమెరాలతో కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. పులి సంచారం దృష్ట్యా దేవీపట్నంలోని గండిపోచమ్మ టెంపుల్‌కు వెళ్లే రోడ్డు మూసివేశారు. పాపికొండలు వీక్షించేందుకు వచ్చే టూరిస్ట్‌ల సంఖ్య గణనీయంగా తగ్గింది.

More in Local