రోడ్ యాక్సిడెంట్లో ఒకరు స్పాట్డెడ్

TG: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంట గ్రామ శివారులో రోడ్ యాక్సిడెంట్ జరిగింది. రెండు బైక్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గుర్జకుంట విలేజ్కు చెందిన ఎర్ర నర్సింహులు (34) బైక్పై గ్రామం నుంచి నేషనల్ హైవే వైపు వస్తుండగా ఎదురుగా మరో బైక్ వచ్చి ఢీకొట్టింది. నంగి రాజు, బండారి రమేష్ బైక్ ఎదురుగా వచ్చి ఢీకొనడంతో నర్సింహులు స్పాట్లోనే చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ రాజు, రమేష్లను చేర్యాల గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు.


