ఉద్యోగాలు కోల్పోయిన 607 మందికి న్యాయం చేయాలి

AP: విజయవాడలో అర్బన్ ఈ–సేవ ఉద్యోగుల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. 2003 నుంచి ప్రభుత్వ అర్బన్ ఈ–సేవ కేంద్రాల్లో సుమారు 18 ఏళ్లపాటు సేవలందించిన 607 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ఈ–సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు కోల్పోయిన తమకు న్యాయం చేయాలని ఆగస్టు 17 నుంచి 20 వరకు ఈఎస్డీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్యోగ సాధన సంకల్ప దీక్షలు చేపట్టారు. కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి. నాగేశ్వరరావు మద్దతు తెలిపారు.




