చేపల చెరువులో విషప్రయోగం.. 4 లక్షల నష్టం

TG: చేపల చెరువులో దుండగులు విషం కలపడంతో 3క్వింటాళ్ల చేపలు మృతి చెందాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పేరుమాండ్ల సంకీస గ్రామ శివారులోని రెడ్డి చేపల చెరువులో గుర్తుతెలియని వ్యక్తులు విషం కలిపారు. సుమారు 3 క్వింటాళ్ల చేపలు మృత్యువాత పడడంతో దాదాపు రూ. 4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


