బుగ్గారంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

TG: జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి (సద్భావన దివస్) వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశాన్ని సాంకేతిక రంగానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు. దేశంలో కంప్యూటర్, టెలికాం విప్లవాన్ని తీసుకువచ్చి, నేటి యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా పునాది వేసిన విజేత ఆయనేనని గుర్తుచేశారు.



