‘మిషన్ శక్తిశాట్’కు సెలెక్టయిన జెస్సీకి మంత్రి ప్రోత్సాహం
AP: ‘మిషన్ శక్తిశాట్’కు సెలెక్టయిన జెస్సీకి మంత్రి కందుల దుర్గేష్ స్మార్ట్ఫోన్, స్మార్ట్వాచ్, పవర్ బ్యాంక్తో పాటు దిల్లీకు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లను అందించారు. రాజమహేంద్రవరం క్యాంప్ ఆఫీస్లో జెస్సీ, ఆమె పేరెంట్స్ను ఇన్వైట్ చేసి కిట్ను ఇచ్చారు. స్పేస్ రీసెర్చ్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించాలని ఆశీర్వదించారు. పదో తరగతి చదువుతూనే ‘శక్తిశాట్’కు ఎంపికైన జెస్సీ ప్రతి స్టూడెంట్కు స్ఫూర్తి అని మంత్రి అభినందించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి దుర్గేష్కు జెస్సీ కృతజ్ఞతలు తెలిపారు.



