విత్తన గుళికల తయారీపై అవగాహన

AP: ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు విత్తన గుళికల విధానం ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు సూచించారు. విజయనగరం జిల్లా రాజాం మండలం గారా చీపురుపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో రాజాం ఏడీఏ రఘు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ప్రయోగాత్మకంగా విత్తన గుళికలను తయారు చేశారు. బీజామృతం, ఘనజీవామృతం పొడి, బంకమట్టి, బూడిదతో గుళికలను తయారు చేసి నీడలో ఆరబెట్టే విధానాన్ని రైతులకు వివరించారు.



