30న పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీలు

TG: ఈనెల 30న జరగబోయే పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీలలో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహాత్మా జ్యోతిబాఫూలె వారధి కమిటీ అసెంబ్లీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు యాంకె పద్మ కోరారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం మందిపల్ గ్రామంలోని అప్పర్ ప్రైమరీ స్కూల్లో పర్యావరణ పరిరక్షణ ప్రచార పత్రం విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, భవిష్యత్తు తరాలకు ఆదర్శవంతంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు.



