ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

TG: బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మహబూబ్నగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎంపీ డి.కె.అరుణ, మేయర్ గుమ్మల మమతా శ్రీనివాస్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో DCC ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు.



