ఆరుగాలం కష్టం.. తడిసి ముద్ధైన ధాన్యం

TG: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కురిసిన వర్షం అన్నదాతలను తీవ్రంగా నష్టపరిచింది. మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లారీలు, హమాలీలు, గన్ని బ్యాగుల కొరత వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరారు.





