← Back to news

చీకట్లో పాముల భయం.. బస్తీ వాసుల అవస్థలు

By Pallati Vikramkumar· 20 Aug 2026
చీకట్లో పాముల భయం.. బస్తీ వాసుల అవస్థలు

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ డివిజన్‌లోని హమీదుల్లా నగర్ బస్తీ మూడునెలలుగా వీధిదీపాలు లేక చీకట్లోనే ఉంటోంది. రాత్రివేళ రాకపోకలు సాగించేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టుపక్కల వ్యవసాయ పొలాలు అధికంగా ఉండటంతో చీకటి వేళల్లో విషపురుగులు, పాముల సంచారం పెరిగి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వీధి దీపాల సమస్యను పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చీకట్లో పాముల భయం.. బస్తీ వాసుల అవస్థలు
చీకట్లో పాముల భయం.. బస్తీ వాసుల అవస్థలు

More in Local