← Back to news

భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

By Srikanth Goud· 18 Aug 2026· Kodimial, Kodimial, Jagitial
భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

TG: జగిత్యాల జిల్లా కొడిమ్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ భారతి పెండింగ్ అంశాలు, సాదా బైనామా, మీసేవ ఫైళ్లను పరిశీలించి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. మీసేవ సర్టిఫికెట్లను ఎప్పటికప్పుడు పూర్తి చేసి ప్రజలకు అందించాలని అన్నారు.

More in Local