← Back to news

జాతీయ జెండాపై నిర్లక్ష్యం.. అధికారులపై చర్యలకు డిమాండ్

By sambasiva bochu· 20 Aug 2026

AP: నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో జాతీయ జెండా పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ భీం భారత్ సైనిక్స్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎం.పి.డి.ఓ. కార్యాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు పోలవరపు ఖాజావలి మాట్లాడుతూ.. డేవిస్‌పేట గ్రామ సచివాలయం వద్ద ఆగస్టు 15న ఎగురవేసిన జాతీయ జెండాను నిబంధనల ప్రకారం అదేరోజు సాయంత్రం దించాల్సి ఉన్నప్పటికీ, రెండురోజుల పాటు చీకట్లోనే ఉంచారని ఆరోపించారు. జాతీయ జెండాను గౌరవించడంలో నిర్లక్ష్యం చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

More in Local