పేద విద్యార్థులకు SI చేయూత

AP: పోలీసు విధులతో పాటు పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ కాకినాడ జిల్లా రౌతులపూడి SI వెంకటేశ్వరరావు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామగ్రిని స్వయంగా స్పాన్సర్ చేసి చదువుకు చేయూత అందించారు. గతంలో ఎ.మల్లవరం గురుకుల పాఠశాలలో క్రీడా ప్రాంగణం అవసరాన్ని గుర్తించి సుమారు రూ.2 లక్షల విలువైన క్రీడా కోర్టును ఏర్పాటు చేయించారు. విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు వారి విద్యాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తున్నారు.



