ఆఫర్ చూసి మోసపోకండి.. టాస్క్ ఫ్రాడ్పై అలర్ట్

AP: టాస్క్ పేరుతో వచ్చే ఆకర్షణీయమైన మెసేజ్లకు స్పందిస్తే క్షణాల్లో డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఆధారిత సైబర్ మోసాలపై వారం రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్సుమిల్లి గ్రామంలో సీఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో ప్రజలు, యువత, విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, అపరిచితులకు నగదు బదిలీ చేయవద్దని సూచించారు.




